న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో మంకీపాక్స్ వైరస్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, కార్యక్రమాలను ఈ విభాగం సూచిస్తుందని అధికారవర్గాలు సోమవారం వెల్లడించాయి. నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలో దీనిని ఏర్పాటుచేశారు.
కేరళకు చెందిన 22 ఏండ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో శనివారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో ఆరు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 75 దేశాల్లో మొత్తం 16 వేల కేసులు రికార్డయ్యాయి. డబ్ల్యూహెచ్వో ఇటీవల మంకీపాక్స్ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.