న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థలైన ఎయిమ్స్ సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ఎయిమ్స్లలో ఫ్యాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ నియామకాల కోసం కేంద్రీకృత వ్యవస్థను ప్రవేశపెట్టేందుకున్న అవకాశాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ పరిశీలిస్తున్నది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్తోపాటు పీఎంఎస్ఎస్వై అదనపు కార్యదర్శి, న్యూఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్తో ఓ కమిటీని నియమించింది. 18 ఎయిమ్స్ విద్యాసంస్థల్లో దాదాపు 44 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విద్యాసంస్థలకు మొత్తం 4,026 పోస్టులను మంజూరు చేయగా 2,259 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. రాజ్కోట్ ఎయిమ్స్లో 183 గాను కేవలం 40 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి.