న్యూఢిల్లీ: అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ (Gazette) విడుదల చేసింది. ఇప్పటికే పాత పార్లమెంటు భవనానికి (Parliament building) సభ్యులు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం 96 ఏండ్ల నాటి పాత పార్లమెంటు భవానికి ఎంపీలు వీడ్కోలు పలికారు. నేటి నుంచి కొత్త భవనంలో సభా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి.
అంతకుముందు పార్లమెంటు సెంట్రల్ హాల్లో (Central Hall) రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో కార్యక్రమం జరుగనుంది. దాదాపు గంటన్నరపాటు జరుగనున్న ఈ కార్యక్రమం జాతీయ గీతంతో ప్రారంభమై.. జాతీయ గీతంతోనే ముగుస్తుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రసంగించనున్నారు. ఆయనతోపాటు సీనియర్ పార్లమెంటేరియన్లు అయిన బీజేపీ ఎంపీ మేనకా గాంధీ (Maneka Gandhi), జేఎంఎం లీడర్ శిబు సోరెన్ (Shibu Soren) కూడా మాట్లాడ నున్నారు. సెంట్రల్ హాల్ కార్యక్రమానికి ముందు ఎంపీలంతా కలిసి ఫొటో దిగనున్నారు. పాత పార్లమెంటు భవనం లోపలి ప్రాంగణంలో రాజ్యసభ, లోక్సభ సభ్యులు వేర్వేరుగా, అంతా కలిసి మరో ఫొటో తీసుకోనున్నారు.