Google Chrome | న్యూఢిల్లీ, జనవరి 26: గూగుల్ క్రోమ్ ఇంజిన్ వాడుతున్న మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో రెండు తీవ్రస్థాయి లోపాలు ఉన్నాయని, అవి హ్యాకర్లకు అవకాశంగా మారే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ఆదివారం పేర్కొంది. పీసీలు, ల్యాప్టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లతోపాటు మాక్ యూజర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఈఆర్టీ సూచించింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లకు దాంతో పెద్దగా నష్టం ఉండకపోవచ్చని తెలిపింది. గూగుల్ క్రోమ్లోని లోపాలతో ఆయా కంప్యూటర్లు హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉంటుందని, దాంతో సమాచారాన్ని తస్కరించే అవకాశాలుంటాయని హెచ్చరించింది. హ్యాకర్ల నుంచి తప్పించుకునేందుకు యూజర్లు తప్పనిసరిగా గూగుల్ క్రోమ్ని అప్డేట్ చేయాలని సూచించింది.