న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : సూడాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ ప్రారంభించింది. ఇందుకుగానూ పోర్ట్ సుడాన్ వద్ద ఐఎన్ఎస్ సుమెధా నౌకను, ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-130జే విమానాన్ని సిద్ధం చేసింది.
సూడాన్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్కు చేరుకున్నారని, మిగతా వారు కూడా మార్గమధ్యలో ఉన్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సౌదీ అరేబియా 150 మంది, ఫ్రాన్స్ 388 మందిని సూడాన్ నుంచి బయటకు తీసుకొచ్చాయి. వీరిలోనూ పలువురు భారతీయులు ఉన్నారు.