ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘పండోరా పేపర్స్’పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సీబీడీటీ) ఆధ్వర్యంలో బహుళ ఏజెన్సీల బృందంతో ఈ దర్యాప్తు చేపట్టున్నట్లు ప్రబుత్వం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశాల్లో దాచుకున్న సంపద రహస్యాలను ‘పండోరా పేపర్స్’ బయటపెట్టాయి.
ఐదేళ్ల క్రితం వెలుగు చూసిన ‘పనామా పేపర్స్’ కన్నా తాజా పత్రాలు మరింత కలకలం రేపాయి. ఈ క్రమంలోనే పండోరా పేపర్స్పై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీబీడీటీ తెలిపింది. పండోరా పేపర్స్లో పేర్కొన్న పేర్లలో చాలా తక్కువ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయని సీబీడీటీ తెలిపింది. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) వెబ్సైటులో కూడా అన్ని పేర్లు, సంస్థలకు సంబంధించిన వివరాలు విడుదల చేయలేదని సీబీడీటీ వివరించింది.
ఐసీఐజే విడుదల చేసిన జాబితాలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలెబ్రిటీలు, బిలియనీర్లు ఉన్నట్లు సమాచారం. 91 దేశాలకు చెందిన వారి పేర్లతో విడుదలైన ఈ జాబితాలో 300 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.