కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. సోమవారం నుంచి అన్ని హోదాల వారు కార్యాలయాల్లో విధులకు హాజరవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం కాస్త తగ్గిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జితేంద్ర సింగ్ ప్రకటించారు. కరోనాపై పరిస్థితిని ఈ రోజు సమీక్షించాం. కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది. కేసుల సంఖ్య కూడా తగ్గింది. దీంతో ఉద్యోగులందరూ కార్యాలయాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో ఎలాంటి సడలింపులూ ఉండవు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు.
మాస్క్లు ధరించి హాజరవ్వాల్సిందే…
సోమవారం నుంచి ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరవ్వాలని, అయితే అందరూ విధిగా మాస్క్ ధరించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మాస్క్తో పాటు కరోనా నియమాలను కూడా పాటించాలని విజ్ఞప్తి చేశారు.