న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) విజయంపై కాంగ్రెస్ (Congress) పార్టీ ధీమాగా ఉన్నది. ఢిల్లీలోని (Delhi) పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీ ఆఫీస్ వద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన కార్యకర్తలు.. డప్పు మోతలు, జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికర్జున ఖర్గే (Mallikarjun kharge) ఎన్నికైన తర్వాత జరిగిన ఎన్నికలు జరగడం, అందులోనూ ఆయన సొంత రాష్ట్రం కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించింది.
రాష్ట్రంలో అధికార బీజేపీ (BJP) అవినీతిలో కూరుకుపోవడం, అభివృద్ధి మందగించిపోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనికి రాష్ట్ర పాడిపరిశ్రమ సహకారం సంఘమైన నందినీ పాలను కాదని గుజరాత్కు చెందిన అమూల్ను సీఎం బొమ్మై సర్కార్ ప్రోత్సహిస్తున్నదని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో అమూల్ తన వ్యాపారాన్ని విస్తరించడానికి అడుగులు వేస్తుండటంతో స్థానికత రాజుకున్నది. కాంగ్రెస్ పార్టీ దీనిని అస్త్రంగా మలచుకుని ప్రచారం ముమ్మరం చేసింది. అయితే రెండు జాతీయ పార్టీలకు పూర్తిస్థాయిలో మెజారిటీ సాధ్యం కాదని, రాష్ట్రంలో హంగ్ తప్పదని సర్వేలు స్పష్టం చేశాయి. దీంతో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ కానుందని వెల్లడించాయి.
#WATCH | Celebration begins at the Congress office in Delhi ahead of the counting of votes for the 224 seats in the Karnataka Legislative Assembly elections held on May 10.#KarnatakaElectionResults2023 pic.twitter.com/FCSZrwv01C
— ANI (@ANI) May 13, 2023
#WATCH | Celebrations underway at national headquarters of Congress party in New Delhi as counting of votes gets underway for #KarnatakaPolls. pic.twitter.com/e0eGObhLh3
— ANI (@ANI) May 13, 2023