తెలంగాణలో అన్ని స్టేషన్లలో సీసీటీవీ
ఒడిశా, పుదుచ్చేరిలో కూడా.. న్యాయ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 8: దేశవ్యాప్తంగా ప్రతీ పోలీసుస్టేషన్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఆచరణలో అమలు కావట్లేదు. మూడింట ఒక స్టేషనలో కనీసం ఒక కెమెరా కూడా అమర్చలేదని భారత న్యాయ నివేదిక తాజాగా వెల్లడించింది. దేశంలో 17,233 పోలీసుస్టేషన్లు ఉండగా, అందులో 5,396 స్టేషన్లలో కనీసం ఒక సీసీ కెమెరా కూడా లేదని పేర్కొన్నది. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలు తీవ్ర అలసత్వంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించడంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ మాత్రం బాధ్యతాయుతంగా ఉన్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్టేషన్లలో కనీసం ఒక సీసీటీవీ కెమెరాను అమర్చింది. తెలంగాణతో పాటు కనీసం ఒక సీసీటీవీ కెమెరాను అమర్చిన జాబితాలో ఒడిశా, పుదుచ్చేరి కూడా ఉన్నది. ఈ మూడు రాష్ర్టాలను న్యాయ నివేదిక ప్రశంసించింది.
మరీ అధ్వాన్నం
రాజస్థాన్, మణిపూర్, లఢక్, లక్షద్వీప్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. కనీసం 1 శాతం పోలీసుస్టేషన్లలో కూడా కెమెరాలు అమర్చలేదు. రాజస్థాన్లో అయితే 894 పోలీసుస్టేషన్లు ఉండగా, ఒక్క స్టేషన్లో మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేశారు. పౌరుల రక్షణలో కీలకమైన పోలీసుస్టేషన్లలో కార్యకలాపాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
భారత న్యాయ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..