న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల్లో నెలరోజుల్లోగా తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన ప్రమాణ పత్రాన్ని మార్చి 29లోగా సమర్పించాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల్లోని అన్ని ప్రాంతాలు కనిపించేలా సీసీటీవీ కెమెరాలు అమర్చాలని 2020లోనే సుప్రీంకోర్టు ఆదేశించింది.