న్యూఢిల్లీ: ఆరు, తొమ్మిది, పదకొం డు తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్’ ను వర్తింపజేస్తూ సీబీఎస్ఈ పైలట్ ప్రాజెక్ట్ను చేపట్టింది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఈ పైలట్ ప్రాజెక్ట్లో పాల్గొనేందుకు తమ అనుబంధ స్కూల్స్ ను ఆహ్వానిస్తున్నామని సీబీఎస్ఈ అధికారులు బుధవారం వెల్లడించా రు.
క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అమలుకు సంబంధించి మార్గదర్శకాలను సీబీఎస్ఈ సిద్ధం చేసింది.కేంద్రం గతేడాది ‘జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్’ ను ఆవిష్కరించింది. దీని ప్రకారం, ప్రీప్రైమరీ నుంచి పీహెచ్డీ వరకు విద్యార్థులకు క్రెడిట్స్ జారీచేస్తారు.