న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: సీబీఎస్ఈకి భారీ ఊరట లభించింది. ఈ సంస్థకు పన్ను మినహాయింపును ఇస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2021-2025 వరకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. సీబీఎస్ఈ (ఢిల్లీ) బోర్డును ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, అంతేగాక ఈ సంస్థ ఇతర ఎలాంటి ఆర్థిక వ్యవహారాలను చేపట్టడం లేదని, అందుకే పన్ను మినహాయింపునిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. పరీక్షల కోసం వసూలు చేసిన ఫీజులు, పుస్తకాల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులు, పబ్లికేషన్లు, ఇతర ఆదాయ వనరులకు ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నది.