న్యూఢిల్లీ: త్రి భాషా విధానం అమలుపై ఇవాళ సీబీఎస్ఈ( CBSE) కొత్త సూచనలు జారీ చేసింది. మూడు భాషలు చదవాలన్న నిబంధన నుంచి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులను మినహాయిస్తున్నట్లు సీబీఎస్ఈ చెప్పింది. ఇక 9వ తరగతి విద్యార్థులకు ఓ అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థులు త్రీ లాంగ్వేజెస్ స్టడీ చేయాలని, కానీ దాంట్లో రెండు విదేశీ భాషలు, ఓ భారతీయ భాష ఉండవచ్చు అని వెసలుబాటు కల్పించింది. త్రీ లాంగ్వేజ్ విధానంపై సీబీఎస్ఈ ప్రకటన చేసిన నెల రోజుల తర్వాత ఈ మినహాయింపు కల్పించారు. 9వ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా రెండు స్వంత భాషలు ఉండాలని సీబీఎస్ఈ పేర్కొన్నది.
సీబీఎస్ఈ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ అనేక మంది విద్యార్థులు, పేరెంట్స్ కోర్టును ఆశ్రయించారు. సీబీఎస్ఈ అకాడమిక్స్ డైరెక్టర్ ప్రజ్ఞా ఎం సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు త్రీ లాంగ్వేజ్ పాలసీ అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. ఇక ప్రస్తుతం ఏడు నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ బోర్డు పరీక్షల్లో .. పదో తరగతిలోకి ప్రవేశించిన తర్వాత త్రీ లాంగ్వేజ్ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదన్నారు.
2026-27 వార్షిక సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వన్టైం అవకాశం కల్పిస్తున్నామని, ఆ విద్యార్థులు రెండు నాన్ నేటివ్ భాషలను, ఓ దేశీయ భాషను చదవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఆరో తరగతి నుంచి దశల వారీగా త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని సీబీఎస్ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 9వ తరగతి మ్యాథమెటిక్స్, సైన్సు సబ్జెక్టుల్లో లెవల్ టూ సిస్టమ్ను ప్రవేశపెట్టిన సీబీఎస్ఈ పేర్కొన్నది.