న్యూఢిల్లీ: పరీక్షలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని సీబీఎస్ఈ హెచ్చరించింది. సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షలు ప్రస్తుతం 7,250 సెంటర్లలో జరుగుతున్నాయి.
ఈ పరీక్షల పేపర్ లీకయ్యిందని, పరీక్ష పత్రం తమ దగ్గర ఉన్నదంటూ కొందరు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని బోర్డు పేర్కొన్నది.