న్యూఢిల్లీ, డిసెంబర్ 29: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్ను గురువారం విడుదల చేసింది. ఒక పరీక్షకు, మరో పరీక్షకు మధ్య సరిపడా సమయం ఉండేలా పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు పేర్కొన్నది. పోటీ ప్రవేశ పరీక్షల తేదీలను కూడా పరిగణనలోకి తీసుకొని సీబీఎస్ఈ పరీక్షల తేదీలు నిర్ణయించామని వెల్లడించింది.