న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఇంటర్, టెన్త్ బోర్డు పరీక్షల తేదీలను సీబీఎస్ఈ ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న టెన్త్ పరీక్షలు ముగుస్తాయి. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఈ మేరకు పరీక్షల పూర్తి టైమ్టేబుల్ను సీబీఎస్ఈ మంగళవారం ప్రకటించింది. జేఈఈ మెయిన్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల తేదీలను నిర్ణయించినట్టు వెల్లడించింది. అలాగే ఒక్కో పరీక్షకు మధ్య విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఉండేలా ఏర్పాటుచేసినట్టు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సాన్యమ్ భరద్వాజ్ తెలిపారు.