న్యూఢిల్లీ, నవంబర్ 9: రైల్వేలో భారీ అవినీతి బయటపడింది. పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారంటూ ముంబయి రైల్వే యార్డ్, పార్సల్ విభాగాల్లో పనిచేస్తున్న 10 మంది రైల్వే అధికారులపై సీబీఐ కేసులు నమోదుచేసింది. రైల్వే విజిలెన్స్, సీబీఐ సంయుక్త సోదాల్లో లభించిన ఆధారాలతో ఈ చర్యలు చేపట్టినట్టు సీబీఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
కుర్లా, సెంట్రల్ రైల్వే ముంబయి, లోకమాన్య టెర్మినస్లలో యార్డ్, పార్సల్ కేంద్రాల్లో పనిచేస్తున్న చీఫ్ పార్సల్ సూపర్వైజర్, చీఫ్ యార్డ్ మాస్టర్, డిప్యూటీ స్టేషన్ మేనేజర్.. మొదలైన అధికారులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నది. ప్రైవేట్ ఏజెంట్స్ నుంచి రైల్వే అధికారులకు రూ.8 లక్షలు, రూ.5 లక్షలు లంచాలు అందినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపింది.