న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీచేసింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని అందులో పేర్కొన్నది. సిసోడియాతోపాటు ఈ కేసుతో సంబంధమున్న మరో 13 మందికి కూడా నోటీసులిచ్చింది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో భారీఎత్తున అక్రమాలు చోటుసుకున్నాయనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా శుక్రవారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలోని సిసోడియా నివాసంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
సీబీఐ లుకౌట్ నోటీసులపై మనీశ్ సిసోడియా స్పందించారు. సోదాల్లో భాగంగా ఒక్క పైసా కూడా దొరకబట్టలేకపోవయారు. ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మనీశ్ సిసోడియా మీకు అందుబాటులో లేడా అని ప్రశ్నించారు. మోదీజీ ఈ జిమ్మిక్కేంది?. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. ఎక్కడి రావాలో చెప్పండి. నేనేమైనా మీకు కనిపించకుండా పోయానా? అని నిలదీశారు.
आपकी सारी रेड फैल हो गयी, कुछ नहीं मिला, एक पैसे की हेरा फेरी नहीं मिली, अब आपने लुक आउट नोटिस जारी किया है कि मनीष सिसोदिया मिल नहीं रहा। ये क्या नौटंकी है मोदी जी?
मैं खुलेआम दिल्ली में घूम रहा हूँ, बताइए कहाँ आना है? आपको मैं मिल नहीं रहा?— Manish Sisodia (@msisodia) August 21, 2022
కాగా, నూతన ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ బుధవారం ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఓ లిక్కర్ వ్యాపారి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహచరుడికి రూ.1 కోటి ముడుపులు అందజేశాడని అందులో పేర్కొన్నది. ఈ నెల 17న నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో 15 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో ఏ1గా సిసోడియా పేరు చేర్చింది. జాబితాలో ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ, హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై తదితరుల పేర్లు ఉన్నాయి.