భువనేశ్వర్, జూన్ 4: ప్రమాద ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని రైల్వే బోర్డు కేంద్రానికి సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భువనేశ్వర్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ… సీబీఐతో తదుపరి దర్యాప్తు చేయించాలని సిఫారసు చేశామని పేర్కొన్నారు. కాగా, ప్రమాదానికి మూల కారణాన్ని, బాధ్యులైన క్రిమినల్స్ను గుర్తించామని ప్రకటించిన కొద్ది సేపటికే రైల్వే మంత్రి సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేయడం గమనార్హం.