న్యూఢిల్లీ: లోక్సభ ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడు ఎస్ భాస్కర్ రామన్ను ఇవాళ సీబీఐ అరెస్టు చేసింది. పంజాబ్లోని తాల్వండి సాబూ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న 263 మంది చైనీయులకు వీసాలు ఇప్పించేందుకు 50 లక్షల లంచం తీసుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 2011లో ఈ ఘటన జరిగింది. కార్తీ చిదంబరం తండ్రి పీ.చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి భాస్కరరామన్ను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ ఉదయం అతన్ని అరెస్టు చేశారు. భాస్కరరామన్ ద్వారా పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న వికాశ్ అనే వ్యక్తి కార్తీని ఆశ్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.