త్రిస్సూర్ (కేరళ) : ఏండ్ల తరబడి కొందరి మనసుల్లో నాటుకుపోయిన సామాజిక రుగ్మతలను నివారించడం సాధ్యం కాదేమోనన్న సందేహం అప్పుడప్పుడు కలుగుతుంది. సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రే కులవివక్షను ఎదుర్కోవడం, దళితుడన్న భావనతో పూజారులే ఆయనను అవమానించడం దీనికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. షెడ్యూల్డ్ కులానికి చెందిన కేరళ మంత్రి కే రాధాకృష్ణన్ ఒక దేవాలయానికి వెళ్లగా అతని చేతికి దీపం అందించకుండా దానిని నేలపై పెట్టి అతని పట్ల ఇద్దరు పూజారులు కులవివక్షతో వ్యవహరించి అవమానపరిచారు. దీనికి సంబంధించి దృశ్యాలు వైరల్ కావడంతో రాష్ట్రం లో సంచలనం కలిగించింది. జరిగిన ఘ టనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మంత్రితో ఈ విషయం చర్చించిన తర్వా త తగిన చర్య తీసుకుంటానని చెప్పారు.