IT Raids : పొగాకు వ్యాపారి నివాసం, కాన్పూర్లోని కంపెనీ సముదాయాలపై మూడు రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఆదాయ పన్ను అధికారులు ఇప్పటివరకూ రూ. 4.3 కోట్ల నగదు రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగదు, నగలను కాన్పూర్కు చెందిన బన్సీధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కేకే మిశ్రా ఢిల్లీ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇక శుక్రవారం మిశ్రా నివాసంలో రూ. 60 కోట్ల విలువైన రోల్స్ రాయిస్, లంబోర్గిని వంటి లగ్గజీ కార్లను గుర్తించారు. రూ. 2.5 కోట్ల విలువైన డైమండ్ వాచ్ సహా ఐదు లగ్జరీ వాచ్లను గుర్తించారు. ఐటీ అధికారుల బృందం ప్రస్తుతం మిశ్రాను విచారిస్తోంది. కంపెనీ టర్నోవర్ను తక్కువ చూపుతూ పన్నులు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు.
యూపీ, ఏపీ, గుజరాత్, ఢిల్లీ సహా కంపెనీతో సంబంధం ఉన్న పలు ప్రదేశాల్లో ఏక కాలంలో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు శనివారం మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. కాగా ఐటీ అధికారులు మిశ్రాను ప్రశ్నిస్తుండగా అనారోగ్య కారణాలతో ఆయన సమాధానాలను దాటవేస్తున్నాడని చెబుతున్నారు.
Read More :