MP Mahua Moitra | న్యూఢిల్లీ : పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బిజినెస్మన్ దర్శన్ హీరానందానీ గురువారం గట్టి షాక్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేయడానికి ఏకైక మార్గం పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలను అడగడమేనని ఆమె భావించారని తెలిపారు.
అదానీపై ప్రశ్నలను రూపొందించేందుకు ఆమె తన పార్లమెంటు లాగిన్ ఐడీని, పాస్వర్డ్ను తనకు ఇచ్చారని తెలిపారు. దీని కోసం తమకు పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు, అదానీ కంపెనీల్లో గతంలో పని చేసిన ఉద్యోగులు సహకరించారని తెలిపారు. ఆమె తన వద్ద విలువైన వస్తువులను కూడా తీసుకున్నారని, ప్రతిపక్షాలు పరిపాలించే రాష్ర్టాల్లో తన వ్యాపారానికి ఆమె ద్వారా సహకారం అందుతుందనే ఉద్దేశంతోనే తాను ఆమెకు సహకరించానని తెలిపారు. ఈ వివరాలను ఆయన అఫిడవిట్ రూపంలో సమర్పించారు.