న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కోసం ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ ప్రారంభమైంది.
ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్టేట్మెంట్లను గురువారం ఈ కమిటీ నమోదు చేసింది. ఈ కేసులో తన వాదనను వినిపించేందుకు ఈ నెల 31న తమ ఎదుట హాజరుకావాలని మహువాను కోరినట్లు ఈ కమిటీ చీఫ్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ చెప్పారు.