MP Mahua Moitra | న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రశ్నలు అడగటానికి ముడుపులు తీసుకున్నారని తనపై వచ్చిన ఆరోపణలపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీని ప్రధాని కార్యాలయం బెదిరించి, అఫిడవిట్పై సంతకం చేయించిందని ఆమె ఆరోపించారు. సీబీఐ కానీ, పార్లమెంటు ఎథిక్స్ కమిటీ కానీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
హీరానందానీ గురువారం పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఓ అఫిడవిట్ను సమర్పించారు. ప్రధానిపై విమర్శలు చేస్తే, తన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని మహువా భావించారని, అందుకే అదానీ గ్రూప్పై అనేక ప్రశ్నలు పార్లమెంటులో అడిగారని తెలిపారు. ఆమె తన పార్లమెంటు అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను తనకు ఇచ్చారని, తాను వాటిని ఉపయోగించుకుని ప్రశ్నలు అడగడానికి అవసరమైన సమాచారాన్ని పంపించానని తెలిపారు.