న్యూఢిల్లీ : బాలలపై లైంగిక నేరాల కేసులు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో లక్షలాదిగా పెండింగ్లో ఉన్నాయి. కొత్త కేసులు నమోదు కాకుండా, కనీసం వీటిని పరిష్కరించాలన్నా తొమ్మిదేండ్లు పడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి కనీసం 25 ఏండ్లు పడుతుందని ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐసీపీటీ) నివేదిక వెల్లడించింది.
2023 జనవరి 31నాటికి ఈ కోర్టుల్లో 2,43,237 పోక్సో కేసులు నమోదైనట్లు తెలిపింది. కోర్టుల్లో కేసు నమోదైనప్పటి నుంచి ఒక ఏడాదిలోగా విచారణను ముగించి, దోషులను శిక్షించాలి. అయితే ఈ కోర్టుల్లో మొత్తం కేసులు 2,68,038 కాగా, వీటిలో కేవలం 8,909 కేసుల్లో మాత్రమే దోషిత్వ నిర్థరణ జరిగిందని ఐసీపీటీ తెలిపింది.