భోపాల్: ‘చేతులు నరకండి’ (Chop Off Hands) అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్ సింగ్ భూరియా మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రత్లాం-జాబువా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంతిలాల్ బహురియాకు మద్దతుగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థిని అనితా చౌహాన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెకు చెందిన భిలాలా వర్గాన్ని దొంగలు, దోపిడీదారులుగా అభివర్ణించారు. ‘ఓట్లు చీల్చేవారు, జేఏవైఎస్ (జై ఆదివాసీ యువశక్తి సంఘటన్) గురించి ఎవరైనా మాట్లాడితే, వారి చేతులు నరికివేయండి. వారిని విడిచిపెట్టవద్దు. వారితో అలాగే ప్రవర్తించండి. అప్పుడే వారు మిమ్మల్ని గుర్తిస్తారు’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్ సింగ్ భూరియా చేసిన ఈ వివాదస్పద వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఆయన ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ నేతల ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. దీంతో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.