గుండెసమస్యలు, ఆస్తమాతో 42% మరణాలు
కొవిడ్తో 10 శాతం మంది మృత్యువాత
రిజిస్ట్రార్ జనరల్ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, మే 26: దేశంలో అత్యధిక శాతం మంది గుండె సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్లే మృత్యువాత పడుతున్నారు. 2020 సంవత్సరంలో 42 శాతం మంది ఈ మూడు సమస్యలతోనే చనిపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో 2020లో జరిగిన మరణాలపై రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఓ నివేదిక విడుదల చేశారు.
కొవిడ్ కారణంగా 1,60,618 మంది (మొత్తం మరణాల్లో 9 శాతం) మృతి చెందారని నివేదికలో పేర్కొన్నారు. 32.1 శాతం మంది గుండె సంబంధిత కారణాలతో చనిపోగా, శ్వాస సంబంధ సమస్యలతో 10 శాతం మరణాలు సంభవించాయి.