Road Accident | యూపీ కాన్పూర్ దేహత్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీఎస్ఎఫ్కు చెందిన జవాన్ సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సమాచారం మేరకు.. కాన్పూర్ దేహత్లోని సికింద్రాలోని సందల్పూర్ రహదారిపై జగన్నాథ్పూర్ గ్రామ సమీపంలో సోమవారం వేకువ జామున స్విఫ్ట్ డిజైర్ కాదు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ఔరయా జిల్లాకు చెందిన వీరంతా మధ్యప్రదేశ్లోని భిండ్లోని ఫుప్గావ్లో తిలక్ వేడుకలో పాల్గొని.. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.