Car Accident : ఉత్తరప్రదేశ్ రాయ్బరేలి(Rai Bareli)లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా ఎనిమింది మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి నైనిటాల్ హైవే(Nainital High Way) మీద వేగంగా వెళ్తున్న ఒక కారును ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దాంతో, ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారు డోర్లు సెంట్రల్ లాక్ అయి తెరుచుకోలేదు.
దాంతో తప్పించుకునే దారిలేక కారులో ప్రయాణిస్తున్న వాళ్లంతా మంటల్లోనే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఏడుగురు పెద్దవాళ్లు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదంలో కారుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈ యాక్సిడెంట్కు సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది.
‘హైవేపై వెళ్తున్న కారు ఒక్కసారిగా భోజిపుర(Bhojipura) వద్ద అదుపుతప్పి పక్క రోడ్డులోని ట్రక్కును ఢీకొట్టింది. దాంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో అందులోని ఎనిమిది మంది సజీవదహనమయ్యారు అని’ బరేలి ఎస్పీ సుశిల్ చంద్ర భాను ధులే(Sushil Chandra Bhan Dhule) తెలిపారు. అయితే.. వాళ్లంతా కారులో బంధువుల పెండ్లికి బయల్ధేరారని, ఊహించని విధంగా ప్రమాదంలో మృతి చెందారని సుశిల్ చెప్పారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.