హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 30న పోలింగ్ తేదీని ఖరారు చేసింది. కంటోన్మెంట్ బోర్డు చట్టం 2006(40 ఆఫ్ 2006)లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం బోర్డు ఎన్నికలకు నిర్ణయించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్ మిట్టల్ శుక్రవారం గెజిట్ జారీ చేశారు.