పాట్నా, జూలై 30: డిసెంబర్ 31 రోజు రాత్రి కొత్త నిర్ణయాలు తీసుకోవడం సామాన్యులకు సాధారణమే. మద్యం ముట్టను.. ఉదయాన్నే జాగింగ్ చేస్తాను.. వంటి నిర్ణయాలు తీసుకోవడం, రెండు మూడు రోజులు కాగానే వాటిని మర్చిపోవడమూ కామనే. కానీ, బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా బైకుంతపూర్ గ్రామానికి చెందిన ధరమ్దేవ్ రామ్.. వింత శపథం చేశాడు.
మహిళలపై అఘాయిత్యాలు ఆగేదాకా, భూవివాదాలు ముగిసే వరకు, అమాయక మూగ జీవాలను చంపడం మానేంత వరకు స్నానం చేయబోనని శపథం చేశాడు. ప్రస్తుతం ధరమ్దేవ్ వయస్సు 40 ఏండ్లు. 22 ఏండ్ల క్రితం చేసిన శపథం మేరకు నేటికీ అయన స్నానం చేయలేదు. ఆయన భార్య, కొడుకు చనిపోయినా చుక్కనీటి బొట్టు శరీరం మీద పడనీయలేదు. 22 ఏండ్లుగా స్నానం చేయకపోయినా అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకపోవడం స్థానికులను ఆశ్చర్య పరుస్తున్నది.