న్యూఢిల్లీ: కోవిడ్ వేళ అసెంబ్లీలో పోటీపడే అభ్యర్థులకు కొత్త ఆప్షన్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్ను ఆన్లైన్ ద్వారా వేయవచ్చు అని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. పోలింగ్ బూత్లను 16 శాతం పెంచారు. పోలింగ్ బూత్ల్లో ఓటర్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు సీఈసీ చెప్పారు. ఇక కోవిడ్ మూలంగా అభ్యర్థుల నామినేషన్ను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును 40 లక్షలకు ఫిక్స్ చేశారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును 28 లక్షలు ఉంటుందని సీఈసీ వెల్లడించారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో సుశీల్ ఈ విషయాలను వెల్లడించారు.
రోడ్డు షోలు.. పాదయాత్రలపై నిషేధం
జనవరి 15వ తేదీ వరకు రోడ్డు షోలు, సైకిల్ యాత్రలపై నిషేధం విధించారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు ప్రచారం ఉండదు. అభ్యర్థులు డిజిటల్ ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చారు. విక్టరీ ర్యాలీలను కూడా రద్దు చేశారు.
ఏడు దశల్లో..
అయిదు రాష్ట్రాల ఎన్నికలను ఏడు దశల్లో పూర్తి చేయనున్నట్లు సీఈసీ చెప్పారు. జనవరి 14వ తేదీ తొలి నొటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు యూపీ ఫస్ట్ ఫేస్ను రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 10న ఎన్నికలు ఉంటాయి.