న్యూఢిల్లీ, మార్చి 24: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) 2024 ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం అభ్యర్థులు మరోమారు తమ ఆధిపత్యాన్ని చాటారు. జేఎన్యూఎస్యూ అధ్యక్షుడిగా లెఫ్ట్ అభ్యర్థి ధనుంజయ్ విజయం సాధించారు.
ఏబీవీపీ అభ్యర్థి ఉమేశ్ చంద్రపై ఆయన గెలుపొందారు. అధ్యక్ష సహా ఉపాధ్యక్ష, జనరల్ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ పదవులన్నీ లెఫ్ట్ అభ్యర్థులు తిరిగి నిలబెట్టుకున్నారు. నాలుగేండ్ల తర్వాత జరిగిన జేఎన్యూఎస్యూ-2024 ఎన్నికల ఫలితాలు ఆదివారం రాత్రి వెలువడ్డాయి. ఈ స్టూడెంట్స్ ఎన్నికల్లో దాదాపు 7 వేలమందికిపైగా విద్యార్థులు ఓటేశారు.