న్యూఢిల్లీ: కెనడా కేంద్రంగా వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్స్టర్ లక్బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పటికే దేశం నుంచి పారిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న లాండా (34) పంజాబ్లోని తర్న్ తరన్ జిల్లా హరికేకు చెందిన వాడు.
ప్రస్తుతం కెనడాలోని అల్బెర్టా ప్రాంతం ఎడ్మాంటన్లో ఉంటున్న అతడు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని హోం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సీమాంతర ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలతో లాండాకు సంబంధాలున్నాయని, గత ఏడాది మొహాలిలో గ్రనేడ్ దాడిలో ఇతనే సూత్రధారని చెప్పారు.