Tripura : అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి వలస వచ్చిన పక్షులు త్రిపురలోని సుఖ్సాగర్ సరస్సులో చనిపోయాయి. త్రిపురలోని సుఖ్సాగర్ సరస్సులో తేలుతూ కనిపించిన ఈ పక్షులను అటవీ అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకోగానే అటవీ ఉన్నతాధికారులు సరస్సు వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్మార్టం నిర్వహిస్తున్నామని, విచారణకు కూడా ఆదేశించామని గోమతి డివిజనల్ అటవీ అధికారి మహేంద్ర సింగ్ తెలిపారు. అయితే ఆ సరస్సులో క్రిమిసంహారక మందులు కలిసి వుండొచ్చని, ఆ విషతుల్యమైన నీటిని తాగడం ద్వారా పక్షులు చనిపోయాయని అటవీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే 100 కంటే ఎక్కువే పక్షులు మరణించి ఉంటాయని తాము అనుమానిస్తున్నామని, ఎన్ని పక్షులు చనిపోయాయో పూర్తిగా నిర్ధారణకు మాత్రం రాలేకపోతున్నామని అధికారులు అంటున్నారు.