సిమ్లా: ఎత్తైన ప్రాంతంలో రోప్ వేపై ఒక కేబుల్ కార్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో అది ముందుకు కదలలేదు. దీంతో అందులో చిక్కుకున్న పది మందికి పైగా పర్యాటకులు భయాందోళన చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పర్వానూలోని టింబర్ ట్రెయిల్ ప్రైవేట్ రిసార్ట్కు చెందిన రోప్ వేపై వెళ్లే కేబుల్ కార్లు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. శివాలిక్ పర్వత శ్రేణుల మీదుగా ఇవి ప్రయాణిస్తూ పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి.
కాగా, సోమవారం మధ్యాహ్నం 11 మంది పర్యాటకులు ఉన్న కేబుల్ కార్ ఎత్తైన కొండ ప్రాంతంలో రోప్ వేపై నిలిచిపోయింది. సాంకేతిక సమస్య వల్ల అది ఎంతకీ ముందుకు కదలలేదు. దీంతో అందులో ఉన్న 11 మంది పర్యాటకులు గంటన్నర వరకు చిక్కుకుపోయారు. ఇందులో ఇద్దరు వృద్ధులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. భయాందోళన చెందిన వారంతా సహాయం కోసం అర్తనాదాలు చేశారు.
మరోవైపు సాంకేతిక బృందం మరో రోప్ వేపై ఆ కేబుల్ కార్ వద్దకు చేరింది. అయితే అది కదలలేని పరిస్థితిలో ఉండటంతో చివరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు. రోప్ వేపై చిక్కుకున్న కేబుల్ కార్లోని ఇద్దరిని సురక్షితంగా తాళ్ల సహాయంతో కిందకు దించి రక్షించారు. మూడు గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్లో మిగతా 9 మందిని కూడా కాపాడారు. పర్వానూ పోలీసులు, ఇతర అధికారులు రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించారు.
#WATCH Cable car trolly with tourists stuck mid-air at Parwanoo Timber Trail, rescue operation underway; tourists safe#HimachalPradesh pic.twitter.com/mqcOqgRGjo
— ANI (@ANI) June 20, 2022
#WATCH | Himachal Pradesh: Rescue operation underway at Parwanoo Timber Trail where a cable car trolly with tourists is stuck mid-air.
2 people have been rescued, 9 are still stranded. NDRF team shortly to reach the spot: Dhanbir Thakur, SDM Kasauli pic.twitter.com/gygYHK0II0
— ANI (@ANI) June 20, 2022