Parliament Sessions : ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ(Cabinet Meeting) ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సెషన్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ముఖ్య నేతలు సుదీర్ఘ చర్చలు జరిపారు. మరో విషయం ఏంటంటే.. కొత్తగా నిర్మించిన పార్లమెంట్(New Parliametn)లో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 20న మహిళా రిజర్వేషన్ బిల్లు(Womens Reservation Bill)ను లోక్సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు పాత భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సహా పలు కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని భారత రాష్ట్ర సమితి ఎంపీ(BRS MPs)లు పట్టుపట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) కొన్నాళ్లుగా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పోరాటం చేస్తున్నారు. అన్ని పార్టీల నుంచి ఒత్తిడి రావడంతో కేంద్ర ఈ బిల్లును తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.