న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: 2024-25 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీని(చెరకు రైతులకు మిల్లులు చెల్లించే కనీస ధర) క్వింటాల్కు రూ.25 పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో క్వింటాల్కు ఎఫ్ఆర్పీ రూ.340కి చేరింది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ప్రధానంగా చెరకు పండిస్తారు. మరోవైపు, ఉపగ్రహాల భాగాల తయారీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించటం ద్వారా అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను ప్రభుత్వం బుధవారం సడలించింది.