బెంగళూరు, అక్టోబర్ 19: బీజేపీతో పొత్తు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీలో చిచ్చుపెట్టింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆ పదవి నుంచి తొలగించారు.
రాష్ట్ర వర్కింగ్ కమిటీని గురువారం రద్దు చేయడంతో.. ఇబ్రహీంను కూడా అధ్యక్ష పోస్టు నుంచి తొలగించినట్టు అయింది. ఇదే సమయంలో రాష్ట్ర జేడీఎస్ తాత్కాలిక అధ్యక్షుడిగా తన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామిని దేవెగౌడ నియమించారు.