సివిల్లే: సీ-296 ట్రాన్స్పోర్టు విమానం(C-295 Aircraft).. భారతీయ వైమానిక దళంలో చేరింది. స్పెయిన్లోని సివిల్లేలో అందజేత కార్యక్రమం జరిగింది. ఎయిర్బస్ సంస్థ నుంచి ఆ విమానాన్ని ఐఏఎఫ్ తీసుకున్నది. సీ-295 వర్గానికిచెందిన ట్రాన్స్పోర్టు విమానాన్ని వైమానిక దళం రిసీవ్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ చౌదరీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.ఎయిర్బస్ సంస్థకు చెందిన డిఫెన్స్ హెడ్ జీన్ బ్రీస్ డూమంట్ .. సీ295కి చెందిన కీస్ అందజేశారు. ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరీ ఆ కీస్ అందుకున్నారు.
#WATCH | First C-295 transport aircraft to be received by Indian Air Force chief Air Chief Marshal VR Chaudhari in Seville, Spain today from Airbus pic.twitter.com/bI8l1iJvy5
— ANI (@ANI) September 13, 2023
సీ-295 రకానికి చెందిన 56 ట్రాన్స్పోర్టు విమానాలను కొనుగోలు చేయాలని గతంలో ఒప్పంద జరిగింది. దాని ప్రకారం ఇవాళ తొలి విమానాన్ని అందిస్తున్నారు. స్పెయిన్లో 16 విమానాలను అందజేస్తారు. మిగిలిన 40 విమానాలను.. వడోదరలో తయారు చేయనున్నారు. చాలా తక్కువ రన్వేపై టేకాఫ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం సీ-295 విమానంకు ఉంది. యూపీలోని ఘజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్బేస్కు సీ-295 విమానం రానున్నది. సెప్టెంబర్ 25వ తేదీన ఆ విమానం ల్యాండ్ అయ్యే ఛాన్సు ఉంది. ట్రాన్స్పోర్టు విమానాల కోసం సుమారు 21 వేల కోట్లతో గత ఏడాది డిఫెన్స్ డీల్ జరిగింది.
#WATCH | Jean-Brice Dumont, Head of Defence and Aerospace, Airbus hands symbolic keys of C295 aircraft to IAF chief Air Chief Marshal VR Chaudhari in Seville, Spain pic.twitter.com/ahEe4gsN2x
— ANI (@ANI) September 13, 2023