డోడా, ఏప్రిల్ 12: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఓ మినీ బస్సు కొండ మార్గంలో నుంచి జారి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు బస్సు టాప్ ఊడిపోయింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.