బెంగళూరు: ఓవర్ టేక్ చేసిన బస్సు డ్రైవర్కు బైక్పై వెళ్తున్న వ్యక్తి మిడిల్ ఫింగర్ చూపించాడు. దీంతో ఆగ్రహించిన బస్సు డ్రైవర్ ఆ బైకర్ను చితకబాదాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 44 ఏళ్ల సందీప్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి బైక్పై వెళ్తున్నాడు. యలహంక ప్రాంతంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్పై వెళ్తున్న సందీప్ దారి ఇవ్వలేదు. బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయగా అతడు మిడిల్ ఫింగర్ను పైకి చూపాడు.
దీంతో బైక్ను అడ్డగించి బస్సు ఆపిన డ్రైవర్ బైక్ కీ, సందీప్ మొబైల్ ఫోన్ తీసుకుని బస్సులోకి వెళ్లాడు. సందీప్ కూడా బస్సు డ్రైవర్ను అనుసరించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఆగ్రహం పట్టలేని ఆ బస్సు డ్రైవర్ సందీప్ను ఇష్టానుసారంగా కొట్టాడు. సందీప్ భార్య, బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ను నిలువరించేందుకు ప్రయత్నించినా అతడు తగ్గలేదు. డ్రైవర్ దాడిలో గాయపడిన సందీప్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు బస్సు డ్రైవర్ కూడా సందీప్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు మిడిల్ ఫింగర్ చూపించాడని ఆరోపించాడు. దీంతో ఇద్దరి ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బస్సులోని ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన డ్రైవర్ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ బస్సును నడుపుతున్న ఆ డ్రైవర్ను నియమించిన ప్రైవేట్ సంస్థ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది.
Road Rage in #Bengaluru: A #biker was #assaulted by a #BMTC #bus driver for being in the way while overtaking another bus in #Yelahanka.
The driver, who alleged he was shown the middle-finger by the biker, has been suspended. @NammaBengaluroo @WFRising pic.twitter.com/9lLVFhPvZK
— Rakesh Prakash (@rakeshprakash1) November 24, 2022