పథనంతిట్ట, నవంబర్ 19: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైన ఆంధ్రప్రదేశ్ భక్తులు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు పథనంతిట్ట జిల్లాలోని లాహ సమీపంలో ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో 43 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో 8 ఏండ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరంతా విజయవాడకు చెందినవారు. పోలీసులు మాట్లాడుతూ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్టు చెప్పారు.