న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను ప్రపంచ శ్రేణి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని సంకల్పించింది కేంద్రం. దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లనున్నది అయోధ్య. ఈ నేపథ్యంలో ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు శరవేగంగా అమలులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించారు. గంటకు 320-350 కి.మీ. వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు 670 కి.మీకి పైగా దూరాన్ని కవర్ చేస్తుంది.
ఇప్పటికే మర్యాద పురుషోత్తం శ్రీరాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తున్నది. అయోధ్యలో మౌలిక వసతుల కల్పనకు బుల్లెట్ రైలు ప్రాజెక్టు తోడ్పాటునిస్తుంది. ఇప్పటికే విమానాశ్రయ నిర్మాణానికి 75 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి వారణాసి, ప్రయాగ్ రాజ్లను అనుసంధానిస్తూ హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును ప్లాన్ చేసింది. ఇప్పటికే నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) అధికారులు అయోధ్యకు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమిని ఖరారు చేశారు.
ఎన్హెచ్ఎస్ఆర్సీకి ఇప్పటికే బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మర్యాద పురుషోత్తం శ్రీ రాం ఎయిర్పోర్టుకు సమీపంలోనే ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు వస్తున్నది. దీని పరిధిలో అభివ్రుద్ధి పనులను అయోధ్య డెవలప్మెంట్ చేసే పనిలో పడ్డారు. బుల్లెట్ రైలు కోసం లక్నో-అయోధ్య మధ్య 130 కి.మీ. పొడవునా ప్రత్యేక ట్రాక్ నిర్మించనున్నారు. ఆగ్రా-లక్నో-ప్రయాగ్ రాజ్ మీదుగా ఢిల్లీ-వారణాసి మధ్య ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు వస్తున్నది. ఈ సర్క్యూట్ పరిధిలోకి అయోధ్యను చేర్చారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.