నుహ్: హర్యానాలోని నుహ్లో ఇటీవల చెలరేగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ, అక్రమంగా ఇండ్లు నిర్మించారని ఆరోపిస్తూ కొంతమంది ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది. తవురు పట్టణంలో సుమారు 250 గుడిసెలను కూల్చివేసింది.
సీఎం ఖట్టర్ ఆదేశాలతో వాటిని పడగొట్టినట్టు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. కాగా, జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా, డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వారి స్థానంలో నరేంద్ర బిజర్నియా ఎస్పీగా, డిప్యూటీ కమిషనర్గా ధీరేంద్ర ఖడ్గటలను నియమించింది.