న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. లాహోరీ గేట్ ప్రాంతంలో ఓ భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించారు.
లాహోరీ గేట్ ప్రాంతంలో ఓ భవనం కూలిపోగా.. ఇప్పటి వరకు ఐదుగురు గాయపడ్డగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల పది మంది వరకు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదని అధికారులు తెలిపారు.