(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) ;జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సర్వేను కూడా అదే రోజు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల పూర్తి అజెండా పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి చేరినట్లు తెలుస్తున్నది. బడ్జెట్ సమావేశాలపై నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.