Budget 2026 | విదేశీ ఆస్తులు వెల్లడించలేదా.. మీకో అవకాశం.. గ్యాంబ్లింగ్కు చెక్ పెట్టేలా కొత్త పన్నుBudget 2026 : భారత పౌరసత్వం ఉన్న పౌరులు తప్పనిసరిగా తమ విదేశీ ఆస్తులు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి. ఇలా వెల్లడించలేకపోతే తర్వాత వాటిపై పన్నులతోపాటు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తారు. అయితే, తాజా బడ్జెట్ 2026లో ఇలాంటివారికి కాస్త ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
విదేశీ ఆస్తులు వెల్లడించని వారిని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటిది కేటగిరి ఏ. విదేశాల్లో ఒక కోటి వరకు ఆదాయం లేదా ఆస్తి కలిగి, ఆ విషయం వెల్లడించకపోతే ఇకపై సాధారణ పన్ను 30 శాతం చెల్లించాలి. అదనంగా పెనాల్టీ బదులు మరో 30 శాతం పన్ను చెల్లిస్తే చాలు. ఇక కేటగిరి బిలో విదేశాల్లో ఐదు కోట్ల విలువైన ఆస్తులు లేదా ఆదాయం ఉన్నవారిని పరిగణిస్తారు. వీరు ముందుగా ఆస్తి వివరాలు వెల్లడించకుంటే తర్వాత రూ.1 లక్ష చెల్లిస్తే చాలు. అయితే, ఇదంతా తర్వాత ఆరు నెలల్లోనే చేయాలి. ఇది వారికి రెండో అవకాశం కింద లెక్క. ఎన్ఆర్ఐకి సంబంధించిన ఆస్తి కొంటుంటే.. అమ్మే వాళ్లకు టీడీఎస్ కట్ చేసి డబ్బు చెల్లించాలి. గతంలో ఇది ముందుగా టాన్లో (టాక్స్ డెడక్షన్ అకౌంట్ నెంబర్)లో డిపాజిట్ చేయాల్సి ఉండేది.
ఈ ప్రక్రియ గందరగోళంగా ఉండటంతో ఇల్లు, ఆస్తుల కొనుగోలుదారులు ఇబ్బంది పడేవారు. ట్యాన్తో సంబంధం లేకుండా ప్యాన్ నెంబర్తో టీడీఎస్ను డిపాజిట్ చేయొచ్చు. బెట్టింగ్, ఇతర ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివారిని గ్యాంబ్లింగ్కు దూరంగా ఉంచాలంటే పన్నులు పెంచడమే మార్గం. అందుకే గేమింగ్ సంస్థలపై పన్నులు రెట్టింపు చేసింది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ని పెంచింది. సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు వంటి మ్యాన్ పవర్ సంస్తలు అందించే సేవలపై పన్ను తగ్గించారు.