న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: కొత్త బడ్జెట్లో విద్యారంగానికి కేంద్రం రూ.1,12,899 కోట్లు కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాలల కోసం కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం సమగ్ర శిక్షా అభియాన్కు గత ఏడాదితో పోల్చితే దాదాపు అంతే మొత్తంలో రూ.37,453 కోట్లు మాత్రమే కేటాయించింది.
సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ అత్యంత కీలకమైన రక్షణ శాఖకు బడ్జెట్లో స్వల్ప పెంపు మాత్రమే చేయడం గమనార్హం. ఐఐటీలు, హరితవృద్ధి, సీబీఐ, ఈవీఎంల కొనుగోలు, మెట్రోప్రాజెక్టులు, క్రెడిట్ సొసైటీల కంప్యూటరీకరణ, పీఎం ఆవాస్ యోజన, రోడ్డు రవాణా, రహదారుల శాఖకు బడ్జెట్లో నిధులు కేటాయించింది.